

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో వచ్చిన ‘రాకాస’ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫారమ్లో ప్రేక్షకులను అలరించేందుకు రానుంది. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రం 2026 మే 1న ప్రముఖ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు తో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సుమారు రూ.15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.27 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి విజయవంతమైంది. డిజిటల్ హక్కుల ద్వారా కూడా మంచి ఆదాయం రాబట్టినట్లు సమాచారం.
కథ విషయానికి వస్తే.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వీరు అనే యువకుడు తన ప్రేమను నెరవేర్చుకోవడానికి స్వగ్రామానికి వస్తాడు. కానీ అనుకోని పరిణామాలతో హత్య ఆరోపణల్లో చిక్కుకుంటాడు. అదే సమయంలో గ్రామంలో ఒక కోట, బ్రహ్మ రాక్షసుడి కథ చుట్టూ ఆసక్తికర సంఘటనలు జరుగుతాయి. ఆ కోటలోకి వెళ్లిన వీరూకి ఎదురయ్యే సవాళ్లు, అక్కడి రహస్యాలు, అతను బయటపడతాడా లేదా అనే ఉత్కంఠభరిత కథతో సినిమా సాగుతుంది.




.webp&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!