
న్యూస్

నటి శివాత్మిక రాజశేఖర్ సినిమా అవకాశాలు, నెపోటిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ నటులు రాజశేఖర్, జీవితల కుమార్తె అయినప్పటికీ ఇండస్ట్రీలో నిలబడటానికి ప్రతిభ ఎంతో ముఖ్యమని ఆమె తెలిపింది. దర్శకులను కలిసే అవకాశం సులభంగా వచ్చినా, నటిగా నిలదొక్కుకోవాలంటే సామర్థ్యం అవసరమని పేర్కొంది. ‘దొరసాని’ సినిమాలో తన నటన చూసే ‘రంగమార్తాండ’లో అవకాశం వచ్చిందని గుర్తు చేసింది.
కొన్ని ప్రాజెక్టుల నుంచి తనను తప్పించారని కూడా శివాత్మిక వెల్లడించింది. తనకంటే ఎక్కువ సోషల్ మీడియా ఫాలోవర్లు ఉన్నవారికి అవకాశాలు ఇచ్చారని తెలిపింది. ఒక పాత్రకు నటి సరిపోతుందా లేదా అన్నది చూడాల్సిందిపోయి, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల ఆధారంగా అవకాశాలు ఇవ్వడం సరైన విధానం కాదని ఆమె అభిప్రాయపడింది. తాను నటినేనని, కంటెంట్ క్రియేటర్ కాదని స్పష్టం చేసింది.



.webp&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!