

తమిళనాడు, కేరళ, బంగాల్, అసోం, పుదుచ్చేరిలలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ దృష్టికి వచ్చిన మూడు గంటల్లోగా ఫేక్ కంటెంట్ను రాజకీయ పార్టీలు సోషల్ మీడియా నుంచి తొలగించాలని స్పష్టం చేసింది. మార్చి 15న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు 11 వేలకుపైగా ఫేక్ పోస్టులు, యూఆర్ఎల్లపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
సీ-విజిల్ యాప్ ద్వారా వచ్చిన 3,10,393 ఫిర్యాదులను పరిష్కరించామని, వాటిలో 96.01 శాతం ఫిర్యాదులను 100 నిమిషాల్లోనే పరిష్కరించినట్లు ఈసీ వెల్లడించింది. ఏఐ జనరేటెడ్ లేదా డిజిటల్గా మార్పులు చేసిన కంటెంట్ను తప్పనిసరిగా లేబుల్ చేయాలని, ప్రచురించే సంస్థ వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. శాంతిభద్రతలకు భంగం కలిగించే పోస్టులను ఐటీ చట్టం కింద పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. పోలింగ్కు ముందు 48 గంటల నిశ్శబ్ద కాలాన్ని కచ్చితంగా పాటించాలని, ఈ సమయంలో ఎలాంటి ప్రచారం చేయరాదని అన్ని వేదికలకు సూచించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!