
రాజకీయాలు

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అవతరించారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీని దాటి ముందంజలో నిలిచారు. ప్రస్తుతం అదానీ సంపద 92.6 బిలియన్ డాలర్లు కాగా, అంబానీ సంపద 90.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అదానీ గ్రూప్ షేర్ల పెరుగుదల ఈ మార్పుకు ప్రధాన కారణంగా నిలిచింది.
అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ వంటి కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. స్టాక్ మార్కెట్ ప్రదర్శన ఆధారంగా ఈ ర్యాంకులు మారుతూ ఉంటాయి. అంతర్జాతీయంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 656 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. ల్యారీ పేజ్, జెఫ్ బెజోస్, సెర్గే బ్రిన్, మార్క్ జుకర్బర్గ్ తదితరులు టాప్ జాబితాలో ఉన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!