.webp&w=3840&q=75)
న్యూస్

నగరంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసి పలు ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడింది. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి, అల్వాల్, సుచిత్ర ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా నగర ఉత్తర భాగంలో సుమారు 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎనిమిది ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈదురుగాలుల ప్రభావంతో నగరంలో 53 చోట్ల చెట్లు నేలకొరిగాయి. హైడ్రా కంట్రోల్ రూమ్కు వచ్చిన ఫిర్యాదులపై DRF బృందాలు తక్షణమే స్పందించి రాత్రి 8.30 గంటల వరకు అన్ని ప్రాంతాలను క్లియర్ చేశాయి. అధికారులు వేగంగా చర్యలు తీసుకోవడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.










.webp&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!