

టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) నాసిక్ ఆఫీసులో జరిగిన ఘటన ఇప్పుడు ఐటీ రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఐటీ ఉద్యోగం అంటే స్థిరమైన జీవితం, తక్కువ టెన్షన్ అని భావించే అభిప్రాయానికి భిన్నంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నాసిక్ బ్రాంచ్లోని ఓ మహిళా ఉద్యోగి దేవ్లాలి పోలీస్ స్టేషన్లో తన ఉన్నతాధికారి తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేయడంతో కేసు ప్రారంభమైంది. అనంతరం మరో ఎనిమిది మంది ఉద్యోగులు కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని ఫిర్యాదులు చేయడంతో మొత్తం 10 కంప్లయింట్లు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఈ ఆరోపణలపై తీవ్రంగా దృష్టి పెట్టారు.
నాసిక్ సిటీ పోలీస్ కమిషనర్ సందీప్ కర్ణిక్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి, ఆరోపణల నిజానిజాలు తెలుసుకోవడానికి ఆరుగురు మహిళా పోలీసులతో కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించారు. 2026 ఫిబ్రవరిలో వారు మారు వేషాల్లో టీసీఎస్ బీపీవో ఆఫీసులో చేరి నెల రోజుల పాటు ఉద్యోగుల ప్రవర్తనను గమనించారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న అధికారుల ప్రవర్తనను రికార్డు చేసి, అన్ని వివరాలను కమిషనర్కు అందించారు. ఆధారాలు సేకరించిన తర్వాత ఏడుగురు ఉద్యోగులను, అందులో సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ సహా, పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం టీసీఎస్ యాజమాన్యం స్పందిస్తూ, ఎలాంటి వేధింపులను సహించబోమని స్పష్టం చేసింది. నాసిక్ ఘటనపై తక్షణ చర్యలు తీసుకున్నామని, ఉద్యోగుల భద్రతకు అత్యున్నత ప్రమాణాలు అమలు చేస్తున్నామని సంస్థ తెలిపింది.











_1775900374811.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!