

దేశంలో పెరుగుతున్న రహదారి ప్రమాదాలను నియంత్రించేందుకు భారత సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రాజస్థాన్లోని ఫలోడీ, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన ప్రమాదాలను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టిన కోర్టు, రహదారులపై అక్రమ పార్కింగ్లు, బ్లాక్స్పాట్ల వద్ద జరుగుతున్న ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికీ గౌరవప్రదంగా జీవించే హక్కుతో పాటు సురక్షిత ప్రయాణ హక్కు కూడా ఉందని స్పష్టం చేసింది.
మార్గదర్శకాల ప్రకారం, అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థలను అమలు చేయాలి, రైట్ ఆఫ్ వేలో కొత్త వాణిజ్య నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు, జాతీయ రహదారుల పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను 60 రోజుల్లో తొలగించాలి. 15 రోజుల్లో జిల్లా స్థాయి రహదారి భద్రతా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, ప్రతి 75 కి.మీకి పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించింది. ప్రమాదాలు జరిగే బ్లాక్స్పాట్లను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ చర్యల అమలుపై రెండు నెలల తర్వాత కోర్టు సమీక్ష నిర్వహించనుంది.


.png&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!