.webp&w=3840&q=75)
న్యూస్

ఎంఎంటిఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యంపై తెలంగాణ ప్రభుత్వం అధికారిక వివరణ ఇచ్చింది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలోనే ఉందని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 7, 2026న హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా మరియు పట్టణాభివృద్ధి శాఖ తరపున ఈ ప్రతిపాదనను దక్షిణ మధ్య రైల్వేకు సమర్పించినట్లు వెల్లడించింది.
దీనిపై స్పందించిన దక్షిణ మధ్య రైల్వే, అమలు కోసం టర్మ్స్ అండ్ కండిషన్స్తో కూడిన ఎంఓయూ సమర్పించాలని సూచించింది. రైళ్ల నిర్వహణ, టైమింగ్స్, స్టేషన్ సౌకర్యాలపై నిర్ణయం తీసుకునే అధికారం రైల్వే బోర్డుకే ఉందని అధికారులు తెలిపారు. తుది ప్రతిపాదనను రైల్వే బోర్డుకు పంపిన తరువాతే నిర్ణయం వెలువడనుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.










.webp&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!