

టాలీవుడ్ హీరో శర్వానంద్ తన కెరీర్లో ఎదురైన కష్టకాలాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ‘జాను’ సినిమా షూటింగ్ సమయంలో థాయ్లాండ్లో స్కైడైవింగ్ శిక్షణ తీసుకుంటూ ప్రమాదానికి గురై భుజం ఎముక విరిగిపోయిందని తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా క్లిష్టమైన శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని, ఆ సమయంలో తాను తీవ్రమైన శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు.
అయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ ఇండస్ట్రీలో గానీ, బయట గానీ పెద్దగా స్పందన లేకపోవడం తనను కలిచివేసిందని శర్వానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. “పెద్ద హీరోలకు చిన్న గాయం జరిగినా చర్చ జరుగుతుంది.. కానీ నేను పెద్ద సర్జరీ చేయించుకున్నా ఎవరూ పట్టించుకోలేదు” అంటూ తన బాధను వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు శర్వానంద్కు మద్దతుగా నిలుస్తూ ఆయన కష్టాన్ని ప్రశంసిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!