Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీలో ప్రజా ఉద్యమంగా నీటి భద్రత - సీఎం చంద్రబాబు

03:09 AM, 6 ఏప్రిల్, 2026
ఏపీలో ప్రజా ఉద్యమంగా నీటి భద్రత - సీఎం చంద్రబాబు

అమరావతి రాష్ట్రంలో నీటి భద్రత సాధిస్తే ఇతర రంగాల్లో అభివృద్ధి సాధ్యం అవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కరవు రహితంగా చేయడం ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వేసవి ప్రారంభానికి ముందు భూగర్భజలాలు 6 మీటర్ల లోతులో, వర్షాకాలం ముగిసే సమయానికి 3 మీటర్ల లోతులో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన నిర్దేశించారు. ఈ నెల 6వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంపై సాగునీటి సంఘాలు, మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్, వ్యవసాయం, పంచాయతీరాజ్, అటవీ, పశుసంవర్థక శాఖలు సమన్వయంతో జల సంరక్షణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. నీటి సంరక్షణ మరియు జలవనరుల పరిరక్షణను ప్రధాన అజెండాగా తీసుకుని 100 రోజుల కార్యాచరణను ప్రకటించారు. సాగునీటి సంఘాలు కేంద్రీకృతంగా యాక్షన్ ప్లాన్ అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, రాష్ట్రంలోని 60 వేల మంది సభ్యులకు ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక బాధ్యతలు అప్పగించారు. నీటి భద్రతను ప్రజా ఉద్యమంగా మార్చి ప్రజలను భాగస్వాములను చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

ఈ మేరకు ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు నాలుగు దశల కార్యాచరణను ప్రకటించారు. ఈ రోజు నుంచి 15 వరకు పనుల గుర్తింపు, ఈ నెల 16 నుంచి 20 వరకు పరిపాలనా అనుమతులు, ఈ నెల 21 నుంచి జూలై 9 వరకు పనుల అమలు, జూలై 10 నుంచి 14 వరకు పూర్తి చేసిన పనుల నివేదిక సమర్పణ జరగాలని సూచించారు. నీటి పొదుపును ప్రధానంగా తీసుకుని ప్రతి నీటి బొట్టును సమర్థంగా వినియోగించాలన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నీటి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. నీటి భద్రత అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఇది సామూహిక బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రతి చుక్క నీటిని సంరక్షించడం, ప్రతి ఎకరాకు నీరందించడం, ప్రతి రైతుకు భరోసా కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగాలని తెలిపారు. వివిధ శాఖలు, సాగునీటి సంఘాలు, గ్రామ పంచాయతీల సమన్వయంతో అమలు చేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ విధానపరమైన అంశాలను పర్యవేక్షిస్తుందని, జిల్లా మరియు క్షేత్రస్థాయిలో కలెక్టర్, సర్పంచ్ ఆధ్వర్యంలో పనులు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 5697 గ్రామాల్లో భూగర్భజలాల సమస్యను గుర్తించామని, అన్ని చెరువులను నింపి భూగర్భజల మట్టాన్ని కనీసం 1.5 మీటర్ల మేర పెంచడం లక్ష్యమని తెలిపారు. నీటిని నిల్వ చేయడం, పొదుపు చేయడం, మైక్రో ఇరిగేషన్ అమలు చేయడం ద్వారా ప్రతి నీటి బొట్టును సమర్థంగా వినియోగించాలని సీఎం సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమల దర్శనానికి వెళ్లిన స్నేహారెడ్డి కుటుంబం

తిరుమల దర్శనానికి వెళ్లిన స్నేహారెడ్డి కుటుంబం

ఫీజుల పెంపుతో ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ చేస్తున్నాయి - కవిత

ఫీజుల పెంపుతో ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ చేస్తున్నాయి - కవిత

క్యూనెట్‌ కేసులో కీలక విషయాలు రాబట్టిన సిట్

క్యూనెట్‌ కేసులో కీలక విషయాలు రాబట్టిన సిట్

అమరావతి బిల్లుపై నారా లోకేష్ స్పందన

అమరావతి బిల్లుపై నారా లోకేష్ స్పందన

ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ వాకథాన్ ఘనంగా ప్రారంభం !

ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ వాకథాన్ ఘనంగా ప్రారంభం !

తెలంగాణ థియేటర్ రంగంలో భారీ మార్పు

తెలంగాణ థియేటర్ రంగంలో భారీ మార్పు

జగ్జీవన్ రామ్‌కు పవన్ కల్యాణ్ నివాళి, ఆశాభావ సందేశంతో ఈస్టర్ శుభాకాంక్షలు

జగ్జీవన్ రామ్‌కు పవన్ కల్యాణ్ నివాళి, ఆశాభావ సందేశంతో ఈస్టర్ శుభాకాంక్షలు

ఏపీలో ముగిసిన సర్పంచుల పదవీ కాలం – స్పెషల్ ఆఫీసర్ల నియామకం!

ఏపీలో ముగిసిన సర్పంచుల పదవీ కాలం – స్పెషల్ ఆఫీసర్ల నియామకం!

వివో వీ70 ఎఫ్‌ఈ లాంచ్..

వివో వీ70 ఎఫ్‌ఈ లాంచ్..

యూట్యూబ్‌లో లీకైన ‘ధురంధర్ 2’.. అభిమానుల ఫిర్యాదుతో లింక్ డిలీట్!

యూట్యూబ్‌లో లీకైన ‘ధురంధర్ 2’.. అభిమానుల ఫిర్యాదుతో లింక్ డిలీట్!

ట్యాగ్లు
నీటి భద్రతసాగునీటి సంఘాలుఅమరావతి అభివృద్ధిభూగర్భజలాలుకరవు రహిత రాష్ట్రంజల సంరక్షణవ్యవసాయం అభివృద్ధి
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీనేజ్‌లో జాన్వీకి ఎదురైన సోషల్ మీడియా డీప్‌ఫేక్ షాక్
సినిమాలు

టీనేజ్‌లో జాన్వీకి ఎదురైన సోషల్ మీడియా డీప్‌ఫేక్ షాక్

'పెద్ది' నైజాం రైట్స్‌కి షాకింగ్ డీల్?
సినిమాలు

'పెద్ది' నైజాం రైట్స్‌కి షాకింగ్ డీల్?

సోమరితనంపై అమితాబ్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

సోమరితనంపై అమితాబ్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్!

షాకిస్తున్న 'పెద్ది' డిజిటల్ రైట్స్
సినిమాలు

షాకిస్తున్న 'పెద్ది' డిజిటల్ రైట్స్

42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న బాలీవుడ్ హీరోయిన్!
సినిమాలు

42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న బాలీవుడ్ హీరోయిన్!

హాట్ టాపిక్ గా మారిన హీరోల రెమ్యూనరేషన్
సినిమాలు

హాట్ టాపిక్ గా మారిన హీరోల రెమ్యూనరేషన్

కీలక పరిణామం: కేశాలు సహా 30 మంది మావోయిస్టులు లొంగుబాటు
న్యూస్

కీలక పరిణామం: కేశాలు సహా 30 మంది మావోయిస్టులు లొంగుబాటు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అంతర్జాతీయ మధ్యవర్తిత్వం
న్యూస్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అంతర్జాతీయ మధ్యవర్తిత్వం

రాష్ట్రపతి వద్దకు అమరావతి చట్టబద్ధత బిల్లు
రాజకీయాలు

రాష్ట్రపతి వద్దకు అమరావతి చట్టబద్ధత బిల్లు

చమురు ధరల పెరుగుదలతో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి
బిజినెస్

చమురు ధరల పెరుగుదలతో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి

ఐఫోన్ 18 ప్రో లీక్స్, విడుదలకు ముందు ప్రధాన అప్డేట్స్
టెక్నాలజీ

ఐఫోన్ 18 ప్రో లీక్స్, విడుదలకు ముందు ప్రధాన అప్డేట్స్

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ‘4వ అధ్యాయం' సినిమా!
ఓటిటి

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ‘4వ అధ్యాయం' సినిమా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!