

ఐఐటీ హైదరాబాద్ ఆధునిక సాంకేతికతను వినియోగించి ప్రాచీన కళలు, చారిత్రక కట్టడాలను డిజిటల్ రూపంలో భద్రపరుస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న 80 డిజైన్ ఇన్నోవేషన్ కేంద్రాలకు ఈ బాధ్యతలు అప్పగించగా, వాటికి ఐఐటీహెచ్లోని డీఐసీ నోడల్ కేంద్రంగా పనిచేస్తోంది. గత రెండేళ్లుగా తెలంగాణ, తమిళనాడులోని చారిత్రక కట్టడాలు, జానపద సంప్రదాయాలు, ప్రాచీన కళలు, ఆచారాలు, పండుగలను డిజిటలైజేషన్ చేస్తోంది. ఈ కార్యక్రమం కోసం వర్చువల్ రియాలిటీ ల్యాబ్ ఏర్పాటు చేసి, డీఐసీ విభాగాధిపతి దీపక్ జాన్ మాథ్యూ ఆధ్వర్యంలో పీహెచ్డీ విద్యార్థులు మరియు ఐఐటీహెచ్ విద్యార్థులు పాల్గొంటున్నారు.
త్రీడీ స్కానింగ్, లైడార్ సాంకేతికతలను ఉపయోగించి రామప్ప ఆలయం, వరంగల్ ఖిలా, మెదక్ చర్చి, మెదక్ కోట వంటి కట్టడాలను ఇప్పటికే డిజిటల్గా భద్రపరిచారు. కుతుబ్ షాహీ కాలానికి చెందిన మౌఖిక చరిత్రను 360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ యానిమేషన్ ద్వారా సంరక్షిస్తున్నారు. నిర్మల్ పెయింటింగ్స్, నకాషీ కళ, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట చేనేత చీరల తయారీ విధానాలు కూడా ఇందులో భాగం అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రాంతంలోని ఓజా గిరిజన తెగ ఆచారాలను నమోదు చేసేందుకు విద్యార్థులు నెలల తరబడి అక్కడే నివసించారు. వీఆర్ గ్లాసెస్ ద్వారా ఈ వీడియోలను వీక్షిస్తే ప్రత్యక్షంగా ఆ చారిత్రక ప్రదేశాలను చూసిన అనుభూతి కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు.



.webp&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!