
రాజకీయాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ ద్వేష ప్రసంగం మరియు ద్వేష నేరాల నిరోధక బిల్లుపై భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లును ప్రజాస్వామ్య గొంతుకను అణచివేసే ప్రమాదకర సాధనంగా అభివర్ణించారు. ప్రభుత్వం విమర్శకులను అణగదొక్కడానికే ఇటువంటి నిరంకుశ చట్టాలను తీసుకువస్తోందని ఆరోపించారు.
ఈ బిల్లు చట్టరూపం దాల్చితే భావ ప్రకటన స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య విలువలకు ముప్పు ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక సామరస్యాన్ని కాపాడటం ముఖ్యమే అయినప్పటికీ, బిల్లులోని నిబంధనలు స్పష్టత లేని విధంగా ఉన్నాయని తెలిపారు. కొన్ని పదాలకు ఖచ్చితమైన న్యాయ పరిమితులు లేకపోవడం వల్ల ప్రతిపక్ష నాయకులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!