

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (ఎన్హెచ్-65)పై కొన్ని వాహనాల టోల్ రుసుములను రూ.5 చొప్పున తగ్గించారు. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1 అర్ధరాత్రి తర్వాత నుంచి అమల్లోకి వస్తాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద 3 యాక్సిల్ కమర్షియల్ వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి రూ.290 నుంచి రూ.285కి, 24 గంటల్లో ఇరువైపులా ప్రయాణానికి రూ.435 నుంచి రూ.430కి తగ్గించారు. అలాగే కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద 3 యాక్సిల్ వాహనాలకు ఒకవైపు రూ.450 నుంచి రూ.445కి, రౌండ్ ట్రిప్కు రూ.675 నుంచి రూ.670కి తగ్గించారు.
ఆంధ్రప్రదేశ్లోని చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి రూ.105 నుంచి రూ.100కు తగ్గించారు. 2 యాక్సిల్ వాహనాలకు రూ.350 నుంచి రూ.345కి, 3 యాక్సిల్ వాహనాలకు 24 గంటల్లో ఇరువైపులా ప్రయాణానికి రూ.570 నుంచి రూ.565కి తగ్గింపు అమలు చేశారు. మిగిలిన వాహనాల రేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!