
ఓటిటి

నిత్యావసర వస్తువుల్లో ముఖ్యమైన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగి సామాన్య ప్రజలకు భారంగా మారాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరల మార్పులు గ్యాస్ ధరల పై ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్–ఇజ్రాయెల్ వివాదం కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశీయ వంట గ్యాస్ ధరలను రూ.60 పెంచాయి.
ఈ పెంపుతో హైదరాబాద్లో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ.965 కు చేరుకుంది. ఇదే సమయంలో విజయవాడలో కూడా ధరలు పెరిగి వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ప్రతి నెల మారే ధరల కారణంగా ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ ధరల పెరుగుదలతో గృహ ఖర్చులు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!