
.webp&w=3840&q=75)
వైఎస్సార్సీపీ పాలనలో తిరుమలకు సరఫరా చేసిన కల్తీ నెయ్యి కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ, కల్తీ నెయ్యి తయారీలో లబ్సా (లీనియర్ ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్) అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనాన్ని వినియోగించినట్లు స్పష్టమవుతోంది. సాధారణంగా లబ్సాను వాషింగ్ పౌడర్లు, డిష్వాష్ లిక్విడ్లు, ఫ్లోర్ మరియు టాయిలెట్ క్లీనర్ల తయారీలో, అలాగే పారిశ్రామిక రంగంలో ఆయిల్, గ్రీజు మరకలు తొలగించేందుకు ఉపయోగిస్తారు. ఇలాంటి రసాయనం ఆహార పదార్థాల్లో వాడటం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు దారి తీస్తుంది.
సిట్ అభియోగపత్రం ప్రకారం, భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు లక్షల కిలోల పామాయిల్, పామ్కెర్నెల్ ఆయిల్తో పాటు లబ్సా, లాక్టిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్లు, మోనోగ్లిజరైడ్స్ వంటి రసాయనాలను కొనుగోలు చేసి కల్తీ నెయ్యి తయారు చేసినట్లు తేలింది. నెయ్యిలా రంగు, వాసన, రుచి రావడానికి ఈ రసాయనాలను కలిపి, ల్యాబ్ పరీక్షల్లో కూడా నెయ్యిగానే తేలేలా మోసానికి పాల్పడినట్లు సిట్ పేర్కొంది. లబ్సా కలిసిన నెయ్యిని వినియోగిస్తే జీర్ణాశయ సమస్యలు, కాలేయ వ్యాధులు, పేగులకు గాయాలు, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాల ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహార భద్రత చట్టానికి విరుద్ధంగా ఇంతటి ప్రమాదకర రసాయనాన్ని వినియోగించడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!