
సినిమాలు

ఆంధ్రప్రదేశ్లో మూడు ప్రధాన ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారాలోకేష్ తెలిపారు. ముంబయిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా కాన్ఫరెన్స్ 2026లో పాల్గొన్న ఆయన, “ఫ్యూచర్ రెడీయింగ్ ఇండియా – ది ఆంధ్ర ఎక్స్పీరియన్స్” అంశంపై మాట్లాడారు. సమర్థ నాయకత్వం, వేగవంతమైన నిర్ణయాలే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాన కారణాలని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో పెట్టుబడుల ఆకర్షణకు అనుకూల వాతావరణం ఏర్పడిందని లోకేష్ చెప్పారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ను తీసుకురావడం, కేవలం 17 నెలల్లో ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టును ప్రారంభించడం రాష్ట్ర సామర్థ్యానికి నిదర్శనమన్నారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అంశంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల కంటే ప్రత్యేకంగా నిలుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!