

హైదరాబాద్ నగర పరిధిలో డ్రగ్ కార్యకలాపాలు ఆందోళన కలిగించే స్థాయిలో పెరుగుతున్నాయి. ఫాంహౌస్లు, పబ్లు కేంద్రంగా డ్రగ్ పార్టీలను నిర్వహిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కొండాపూర్లో మిడ్నైట్ డ్రగ్ రాకెట్ బయటపడిన కొద్ది గంటల్లోనే మరో సంఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్లోని పారడైజ్ సమీపంలో, సన్షైన్ హాస్పిటల్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి సుమారు 7.5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో గ్రాముకు ₹15,000కి కొనుగోలు చేసి, హైదరాబాద్లో ₹30,000కి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆటోలో వచ్చి సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో సికింద్రాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆమెను పట్టుకున్నారు. ఐదు పాకెట్లలో కొకైన్ దాచినట్లు గుర్తించి, నిందితురాలిని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
ఇదిలా ఉండగా, కొండాపూర్లోని ఒక పబ్లో జరిగిన డ్రగ్ పార్టీని ఈగల్ టీమ్ బయటపెట్టింది. క్వేక్ ఏరినా పబ్లో “బ్లాక్ కాఫీ” పేరుతో నైజీరియన్ డీజేతో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించగా, డ్రగ్ పార్టీ జరుగుతోందన్న సమాచారం ఆధారంగా అధికారులు రాత్రి సమయంలో రైడ్ నిర్వహించారు. మొత్తం 64 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా మొదట 8 మందికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అయితే తరువాత ఆ సంఖ్య 7 మందికి తగ్గింది. రిత్విక్ అనే వ్యక్తికి యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చినప్పటికీ, తర్వాత ఎర్రగడ్డ వైద్యులు చేసిన బ్లడ్ టెస్ట్లో నెగిటివ్గా తేలినట్లు పోలీసులు తెలిపారు. నిద్ర మాత్రల ప్రభావంతో యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు సూచించినట్లు చెప్పారు.
డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన వారిలో ఎవరికీ పూర్వ చరిత్ర లేదని పోలీసులు వెల్లడించారు. ఇదే సమయంలో ఆ పార్టీకి హాజరైన నటి హేమ తనకు డ్రగ్ టెస్ట్లో నెగిటివ్ వచ్చినట్లు వీడియో ద్వారా వెల్లడించారు. ఈగల్ టీమ్ చర్యలతో నగరంలో డ్రగ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, డ్రగ్ మాఫియాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని కేసులు బయటపడే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.











.jpg&w=3840&q=75)

.jpg&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!