

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిటైల్ అవుట్లెట్లు పూర్తిగా కార్యకలాపాల్లో ఉన్నాయని సంస్థ వెల్లడించింది. పెట్రోలియం ఉత్పత్తులు తగినంతగా నిల్వలో ఉన్నాయని తెలిపింది. వినియోగదారులకు అవసరమైన ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది.
అదేవిధంగా, తమ నెట్వర్క్ అంతటా ఆటో ఎల్పీజీ అందుబాటులో ఉందని హెచ్పిసిఎల్ పేర్కొంది. అయితే, కొన్ని చోట్ల వేచిచూడాల్సిన సమయం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సూచించింది. చాలా ఆటో ఎల్పీజీ వాహనాలు ద్వంద్వ ఇంధన (బై-ఫ్యూయల్) విధానంలో పనిచేస్తాయని, అవి పెట్రోల్తో కూడా నడిచే సామర్థ్యం కలిగి ఉంటాయని వినియోగదారులకు గుర్తు చేసింది.
వినియోగదారులకు నిరంతర సేవలు అందించడమే తమ లక్ష్యమని, ప్రయాణం సజావుగా కొనసాగేందుకు కట్టుబడి ఉన్నామని హెచ్పిసిఎల్ స్పష్టం చేసింది. ఇంధన సరఫరా విషయంలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

.jpeg&w=3840&q=75)









.jpg&w=3840&q=75)

.jpg&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!