
రాజకీయాలు

అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ సొంతగడ్డపై జరిగిన మ్యాచ్లో భావోద్వేగానికి గురయ్యాడు. ఫిఫా వరల్డ్ కప్ 2026 తర్వాత అంతర్జాతీయ ఫుట్బాల్కు వీడ్కోలు పలకనున్న నేపథ్యంలో, తన అభిమానుల ముందే ఆడిన ఈ మ్యాచ్ ఆయనకు ప్రత్యేకంగా నిలిచింది. జాంబియాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో అర్జెంటీనా జట్టు 5 - 0 తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో మెస్సీ తన కెరీర్లో 116 వ గోల్ నమోదు చేశాడు. అయితే, ఇదే తన స్వదేశంలో చివరి మ్యాచ్ కావడంతో మైదానంలోనే భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ దృశ్యం అభిమానులను కదిలించగా, సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున స్పందనలు వెల్లువెత్తాయి. మెస్సీకి అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!