
క్రీడలు

తెలుగుదేశం పార్టీ కొత్త కమిటీల్లో పదవులు పొందిన నాయకులందరికీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్లకు గౌరవం ఇస్తూనే, కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ, సామాజిక న్యాయం పాటించే విధంగా పొలిట్బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పార్టీతో అనుబంధం, కష్టపడే తత్వం, యువ నాయకత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ కమిటీలను రూపొందించినట్లు పేర్కొన్నారు.
ఈ కొత్త కమిటీలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో పనిచేయడం అంటే రాష్ట్ర అభివృద్ధికి పనిచేయడమేనని పేర్కొంటూ, నాయకులు తమ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!