.jpg&w=3840&q=75)

ఒకప్పటి ప్రముఖ నటి దేవయాని కుమార్తె ప్రియాంక రాజ్ కుమారన్ సినిమా రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఆమె చిన్న కుమార్తె నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. విశేషమేమిటంటే, ఆమె తొలి చిత్రం 2024లో వచ్చిన తెలుగు సినిమా ‘కోర్టు’కు తమిళ రీమేక్. పోక్సో చట్టంపై అవగాహన కల్పించే సామాజిక సందేశంతో ఈ చిత్రం రూపొందుతోంది.
తెలుగు సినిమాను ఆధారంగా చేసుకుని తమిళంలో ‘రంజన్ ది అడ్వకేట్’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు త్యాగరాజన్ దర్శకత్వం వహిస్తుండగా, ఆయన కుమారుడు జీన్స్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్నారు. తెలుగు వెర్షన్లో శ్రీదేవి పోషించిన హీరోయిన్ పాత్రను ప్రియాంక చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభ వేడుక సోమవారం చెన్నైలో ఘనంగా జరిగింది.
ఈ సినిమాతో నిర్మాత ఎస్ కదిరేశన్ కుమారుడు హరి కూడా నటుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు వెర్షన్లో హర్ష్ రోషన్ చేసిన పాత్రను హరి చేస్తున్నారు. దేవయాని తన కుమార్తెను సినీ రంగానికి పరిచయం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రియాంక తప్పకుండా రాణిస్తుందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి విశాల్, వెట్రిమారన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ జరుగుతోంది.










.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!