

డీలిమిటేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం గెర్రీమాండరింగ్కు కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేసిన ఆయన, ఈ బిల్లు ఇప్పటికే 2023లో పార్లమెంట్ ఆమోదం పొందిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతిపాదనకు మహిళా రిజర్వేషన్తో ఎలాంటి సంబంధం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రజలను ఉద్దేశించి ఆయన వీడియో సందేశం విడుదల చేశారు.
డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాల సరిహద్దులను మార్చి తమకు అనుకూలంగా రాజకీయ లాభాలు పొందేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. కులగణనను పక్కనపెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలను కాంగ్రెస్ సహించదని స్పష్టం చేశారు. ఇదే విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా స్పందిస్తూ, జనగణన పూర్తయ్యాకే డీలిమిటేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!