

సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబం నుంచి మరో కొత్త హీరో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. మహేశ్బాబు సోదరుడు రమేశ్బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని శ్రీనివాస మంగాపురం సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇది ఆమెకు తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. సీనియర్ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఆర్ఎక్స్ 100 ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మహేశ్ బాబు తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాస మంగాపురం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. టీజర్లో జయకృష్ణ, రషా జోడీ ఆకట్టుకునేలా కనిపించింది. కొత్త జంట కెమిస్ట్రీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

.jpg&w=3840&q=75)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!