

టాలీవుడ్లో నిర్మాతగా, దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఎమ్మెస్ రాజు మరో కొత్త ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న అగధ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్గా ఆసక్తిని కలిగిస్తోంది. సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై ఆయన నిర్మించిన శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. దర్శకుడిగా కూడా డర్టీ హరి, మళ్లీ పెళ్లి వంటి చిత్రాలతో తన ప్రత్యేక శైలిని చూపించారు.
ఇప్పుడు అగధ కోసం ఆయన కొత్త కాన్సెప్ట్ను తీసుకొచ్చారు. ఏడాది కాలంగా ఈ ప్రాజెక్ట్ పై శ్రమించిన ఆయన, ప్రమోషన్స్ను కూడా విభిన్నంగా ప్రారంభించారు. ఇద్దరు దొంగలు ఆయన ఆఫీస్లోకి వెళ్లి పోస్టర్లను చూస్తూ చివరికి ఒక భయానక పోస్టర్ను చూసి భయపడే ఫన్నీ వీడియో ద్వారా సినిమాపై ఆసక్తి పెంచారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. చీకటి గుహలో వెలిగే కాగడాల మధ్య ఒక భారీ విగ్రహం, దానికి 12 చేతులు ఉండటం, ముందు ఒక యువతి నిలబడి ఉండటం వంటి విజువల్స్ సినిమా మిస్టరీని మరింత పెంచుతున్నాయి.
శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ, ఇది మిస్టికల్ డివైన్ థ్రిల్లర్. 85 రోజుల పాటు విభిన్న లొకేషన్లలో షూటింగ్ చేశాం. సినిమాలో దాదాపు 45 నిమిషాల వీఎఫ్ఎక్స్ ఉంటుంది. సినిమా స్థాయి ఎలా ఉంటుందో దానితో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే నటీనటుల వివరాలు వెల్లడిస్తాం అని తెలిపారు.







.jpg&w=3840&q=75)

.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!