

రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బాధితులకు తక్షణ చికిత్స అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే అన్ని వార్డులు, వెయిటింగ్ ఏరియాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలని, ప్రతి హాస్పిటల్లో ప్రత్యేక బృందాన్ని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
వడదెబ్బ నివారణకు ప్రజల్లో అవగాహన పెంచాలని, బస్ స్టాండ్లు, హాస్పిటళ్లు, రద్దీ ప్రాంతాల్లో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా కూలీలు, రైతులు, డ్రైవర్లు వంటి వర్గాలకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తెలియజేయాలని చెప్పారు. అలాగే విద్యుత్ అంతరాయం సమయంలో జనరేటర్లు సిద్ధంగా ఉండేలా చూడాలని, అగ్ని ప్రమాదాల నివారణకు అన్ని హాస్పిటళ్లలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కూడా ఎండలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించి, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

.jpg&w=3840&q=75)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!