

బీజేపీ నేత, మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి కుమార్తె అర్చితా సచిన్ రహర్ చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఆమె సంబరాలు చేసుకుంటూ, తన మద్దతు విద్యార్థులు, యువతకేనని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
ధర్మేంద్ర ప్రధాన్ కార్యాలయం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు పోస్ట్ తొలగించాలని ఎంపీ తన కుమార్తెను కోరినట్లు సమాచారం. అయితే అర్చితా అందుకు నిరాకరించి, ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ తొలగించనని మరోసారి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమె సోషల్ మీడియా ఖాతాలు కనిపించకుండా పోయాయి. ఇదే సమయంలో ఎంపీ అపరాజితా సారంగి స్పందిస్తూ, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడం గొప్ప విషయమని, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!