

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడం 21వ శతాబ్దపు అతి పెద్ద నిర్ణయాల్లో ఒకటిగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘నారీ శక్తి వందన్’ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి ఈ నెల 16 నుంచి 18 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 2023లో ఈ బిల్లును ఆమోదించడం ద్వారా తొలి అడుగు వేయగా, 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి ఈ రిజర్వేషన్లు అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహిళల ప్రాతినిధ్యం పెరగడం ద్వారా సామాజిక న్యాయం మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ చట్టానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ప్రధాని, దశాబ్దాలుగా కొనసాగుతున్న మహిళా రిజర్వేషన్ డిమాండ్కు ఇది ముగింపు పలుకుతుందని అన్నారు. స్థానిక సంస్థల నుంచి దేశ స్థాయి వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, నిర్ణయ ప్రక్రియలో వారి భాగస్వామ్యం పెరగడం వల్ల సమాజంలో సానుకూల మార్పులు వచ్చాయని తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ, వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!