
బిజినెస్

అడివి శేష్ తన కొత్త సినిమా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇటీవల రష్మిక మందన్న నటించిన ‘ది గర్ల్ఫ్రెండ్’ సినిమాతో మంచి ప్రశంసలు అందుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ ప్రాజెక్ట్ కోసం బలమైన కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా వెంటనే ప్రారంభం కావడం లేదు.
ప్రస్తుతం అడివి శేష్ తన సూపర్ హిట్ ‘గూఢచారి’ సీక్వెల్ ‘G2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ పూర్తయ్యాకే కొత్త ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శేష్ సెలెక్టివ్ కథల ఎంపిక, రాహుల్ ప్రత్యేకమైన కథన శైలి కారణంగా ఈ కాంబినేషన్పై సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ఇదే సమయంలో ‘డెకాయిట్’ సినిమా వసూళ్లు మోస్తరుగా కొనసాగుతున్నాయని, లాభాల్లోకి వెళ్తుందా లేదా అనే చర్చ నడుస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!