
సినిమాలు

బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికగా మారుతోంది. ఈ నెల 14న పాట్నా లో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం (బీజేపీఎల్పీ) జరగనుంది. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసినప్పటికీ నితీష్ కుమార్ ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ఎప్పుడు రాజీనామా చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో కొత్త బీజేపీఎల్పీ నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంది.
నితీష్ రాజీనామా చేసిన తరువాత కూటమిలోని బీజేపీ నుంచి ఒకరు సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను పార్టీ అధిష్టానం నియమించింది. పార్టీలో సమన్వయం సాధించడం ఆయన బాధ్యతగా ఉంది. ఈ సమావేశం తర్వాత తీసుకునే నిర్ణయం ఆధారంగా బిహార్లో నాయకత్వ మార్పు జరగవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!