

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని తెలిపారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ మరియు ప్రజల సౌకర్యం ప్రభుత్వానికి ముఖ్యమని పేర్కొన్నారు.
ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం మరియు కార్మిక సంఘాలకు సంబంధించిన అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, విలీనం విషయంలో ఒక కమిటీ పనిచేస్తోందని తెలిపారు. ఈ అంశాలు తప్ప మిగతా ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉద్యోగులు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఎప్పుడైనా రావచ్చని మంత్రి స్పష్టం చేశారు.
ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ అమలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి డీఏ బకాయిలు లేవని చెప్పారు. పీఆర్సీ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నదని, ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వెల్లడించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!