

ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీని ఘనంగా ఓడించింది. ఈ మ్యాచ్లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో జట్టుకు విజయం అందించాడు. అయితే మ్యాచ్ మధ్యలో అతను చేసిన ఒక చర్య ఇప్పుడు వివాదానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో వైభవ్ డగౌట్లో జట్టు మేనేజర్ రోమీ భిందర్తో కలిసి మొబైల్ ఫోన్ చూస్తూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చర్చనీయాంశంగా మారింది.
బీసీసీఐ నిబంధనల ప్రకారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లు మొబైల్ ఫోన్లు వాడటం లేదా చూడటం అనుమతించబడదు. మేనేజర్కు కూడా డగౌట్లో మొబైల్ వాడే అనుమతి లేదు; అతను డ్రెస్సింగ్ రూమ్లో మాత్రమే ఫోన్ ఉపయోగించవచ్చు. అలాగే మొబైల్ ఫోన్లు, కమ్యూనికేషన్ డివైజ్లు డగౌట్లో పూర్తిగా నిషేధించబడ్డాయి. అనలిస్టులు కేవలం ప్రత్యేకంగా కేటాయించిన టేబుల్ వద్ద మాత్రమే కంప్యూటర్లు ఉపయోగించాలి. ఆటగాళ్లు మరియు సపోర్ట్ స్టాఫ్ స్టేడియంలోకి వచ్చిన వెంటనే తమ డివైజ్లను ఆఫ్ చేసి భద్రపరచాలి. క్యాటరింగ్ వర్కర్స్ వంటి ఇతర సిబ్బంది కూడా కమ్యూనికేషన్ డివైజ్లు తీసుకురావడానికి అనుమతి లేదు. ఈ నేపథ్యంలో వైభవ్ చర్యపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.


















.jpeg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!