
రాజకీయాలు

హైదరాబాద్లో ఒక విద్యార్థిని ఇటీవల జరిగిన ఇంటర్ సెకండియర్ ఆంగ్ల ప్రశ్నపత్రంలో లింగ వివక్ష ఉందని అభ్యంతరం తెలిపింది. ఒక ప్రశ్నలో తల్లి తన కుమార్తెకు వంట నేర్పడం, మరో ప్రశ్నలో తండ్రి తన కుమారుడితో భవిష్యత్ గురించి మాట్లాడడం ఉండటాన్ని ఆమె ప్రశ్నించింది. వంట పనులు అమ్మాయిలకేనా? భవిష్యత్ ప్లాన్స్ అబ్బాయిలకేనా? అంటూ విద్యా వ్యవస్థలో సమానత్వం ఉండాలని చెప్పింది.
కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన మహిమ కీర్తన ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసి తెలియజేసింది. తన తల్లిదండ్రులు ఇద్దరూ వంట చేస్తారని, తాను జాతీయ స్థాయి రైఫిల్ షూటర్గా అవార్డు గెలిచానని చెప్పింది. ఇలాంటి ప్రశ్నలు విద్యార్థులను నిరుత్సాహపరుస్తాయని, వాటిలో మార్పులు చేయాలని కోరింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!