

తెలంగాణలో గోవుల సంరక్షణ కోసం ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో గోశాలలు నిర్మించే పనులు కొనసాగుతున్నాయని, ముఖ్యంగా ఆలయాల సమీప ప్రాంతాల్లో కూడా గోశాలల ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శాసనసభ సమావేశ హాలులో ప్రముఖ జంతు హక్కుల కార్యకర్త, పీపుల్ ఫర్ యానిమల్స్ సంస్థ అధ్యక్షురాలు మేనకా గాంధీ బృందం ముఖ్యమంత్రిని కలిసింది. ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కల నియంత్రణ, గోసంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. స్టెరిలైజేషన్ కార్యక్రమాలు, జంతు సంక్షేమానికి సంబంధించిన చర్యలపై ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జంతు సంరక్షణ కార్యక్రమాల పై మేనకా గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ చొరవను అభినందిస్తూ, జంతువుల సంక్షేమం పై చూపుతున్న నిబద్ధతను ప్రశంసించారు.

.webp&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!