

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరమని అన్నారు. అమరావతి పై శాసనసభలో తీసుకున్న తీర్మానం ఒక డ్రామా మాత్రమేనని పేర్కొన్నారు. రాజ్యాంగంలో ‘రాజధాని’ అనే పదం లేదని చెప్పారు. చంద్రబాబు పాలన అంటే దోపిడీ, అవినీతి అని ఆరోపిస్తూ, అమరావతి గురించి నిజాలు ప్రజలకు తెలియాలని జగన్ అన్నారు.
అమరావతి అభివృద్ధికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని ఆయన చెప్పారు. రోడ్లు, డ్రైనేజీలకే ఎకరానికి రూ.2 కోట్లు ఖర్చవుతాయని, ఆ లెక్కన లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ప్రశ్నించారు. 2019కు ముందు వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్పిన అమరావతిపై ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఎందుకు మార్చుతున్నారని అడిగారు. భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని ప్రశ్నిస్తూ, అమరావతిని పెంచుతూ పోవడం సరైనది కాదని విమర్శించారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!