
సినిమాలు

శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ సీతారాం బాగ్ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
ఈ యాత్ర మధ్యాహ్నం 2 గంటలకు సీతారాం బాగ్ ఆలయం నుంచి ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు కొనసాగనుంది. దాదాపు 3 వేల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి, డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నట్లు వెల్లడించారు. అంతకుముందు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్తో కలిసి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

.jpg&w=3840&q=75)










.jpg.webp&w=3840&q=75)




.jpeg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!