
న్యూస్

“నక్సల్స్ మిషన్ 2026” చివరి రోజున చత్తీస్ఘడ్ రాష్ట్రంలో భారీ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొత్తం 34 మంది మావోయిస్టులు లొంగుబాటు చేయగా, భారీగా ఆయుధాలు, నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లాలోనే 25 మంది మావోయిస్టులు లొంగి 93 ఆయుధాలను అప్పగించడంతో పాటు సుమారు 7 కిలోల బంగారం, ₹2.90 కోట్ల నగదును అధికారులకు అందజేశారు.
దంతెవాడలో ఐదుగురు మావోయిస్టులు లొంగి 40 ఆయుధాలను సమర్పించగా, సూక్మాలో ఇద్దరు లొంగుబాటు చేసి ₹10 లక్షల నగదు, భారీ ఆయుధ డంప్ను అప్పగించారు. అలాగే కాంకేర్ జిల్లాలో ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిణామం రాష్ట్రంలో నక్సలిజంపై ప్రభుత్వ చర్యలకు పెద్ద విజయంగా భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!