

అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన రెండో విడత చర్చలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలను తిరిగి ప్రారంభించేందుకు తనపై ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాల్పుల విరమణ తాత్కాలికమే అన్న వార్తలను ట్రంప్ ఖండించారు. ఇరాన్తో మంచి ఒప్పందం కుదుర్చుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, శాంతి ప్రతిపాదనకు ఎలాంటి గడువు విధించలేదని తెలిపారు.
ఇక కాల్పుల విరమణ కొనసాగుతున్న సమయంలో హర్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కొన్ని నౌకలను ఇరాన్ స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు రాగా, అవి అమెరికాకు చెందినవి కావని ట్రంప్ తెలిపారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు. ఇరాన్ నాయకత్వం బాంబు దాడుల కంటే ఆర్థిక దిగ్బంధనాన్ని ఎక్కువగా భయపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే ఒత్తిడి కొనసాగితే ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అమెరికాపై విమర్శలు చేస్తూ, మాటలు–చర్యల మధ్య తేడాను ప్రపంచం గమనిస్తోందని అన్నారు.
















.jpg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!