
న్యూస్

రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులు అధైర్యపడవద్దని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చలు జరుపుతోందని తెలిపారు. కార్మికులు ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనలు తెలియజేయాలని, ఆవేశంలో ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు నిరసనలకు మద్దతు ఇవ్వడం సరే కానీ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని స్పష్టం చేశారు.
రాజకీయ నాయకుల ప్రేరేపిత వ్యాఖ్యల వల్లే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంటూ, అందరూ సంయమనం పాటించాలని కోరారు. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అన్ని విధాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!