

అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. భారీ సంఖ్యలో అమెరికా యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు, క్షిపణి రక్షణ వ్యవస్థలు ఇరాన్ దిశగా కదులుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, యుద్ధం జరగకూడదనే తమ ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. అయితే అవసరమైతే చర్యలు తీసుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ పరిణామాలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, అవసరమైతే ప్రతిస్పందన తప్పదని హెచ్చరించింది. అమెరికా మాత్రం పశ్చిమాసియాలోని తమ సైనిక స్థావరాల రక్షణ కోసమే ఈ సేనల మోహరింపు అని వివరణ ఇచ్చింది. అయినప్పటికీ యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకతో పాటు పలు మిస్సైల్ డెస్ట్రాయర్లు రంగంలోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!