
టెక్నాలజీ

దేశంలో వరి సాగులో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన పురోగతితో ముందుకు దూసుకుపోతోంది. తాజా గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం 168.8 లక్షల టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేయగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 73.4 లక్షల టన్నుల ఉత్పత్తికే పరిమితమైంది. గత పదేళ్లలో తెలంగాణలో వరి ఉత్పత్తి ఐదు రెట్లు పెరగడం విశేషం కాగా, దేశంలోనే ఒక ప్రధాన ధాన్యాగారంగా తెలంగాణ అవతరించింది.
ఇదే సమయంలో, తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP)లో వ్యవసాయ రంగం వాటా సుమారు 16 శాతం మాత్రమే ఉండగా, ఆంధ్రప్రదేశ్లో మాత్రం వ్యవసాయం ఇప్పటికీ 30 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. అంతేకాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రామికశక్తిలో 50 శాతం కంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ గణాంకాలు రెండు రాష్ట్రాల వ్యవసాయ నిర్మాణంలో ఉన్న భిన్న ధోరణులను స్పష్టంగా చూపిస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!