

తెలంగాణలో ప్రధాన పంటగా సాగుతున్న మొక్కజొన్నకు మద్దతుగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు లేఖ రాశారు. ప్రస్తుత సీజన్లో మొక్కజొన్న విస్తీర్ణం మరియు దిగుబడి గణనీయంగా పెరిగినప్పటికీ, మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడం రైతులకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. కనీస మద్దతు ధరతో పోలిస్తే ప్రస్తుతం రైతులు తక్కువ ధరకు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు తోడ్పడుతోందని చెప్పారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో మొక్కజొన్నను కొనుగోలు చేసి రైతులకు ఊరట కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.
అయితే ఈసారి ఉత్పత్తి మరింత ఎక్కువగా ఉండటం వల్ల పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని, అందుకే కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని మొక్కజొన్నను ధర మద్దతు పథకం (PSS)లో చేర్చి కొనుగోలు చేపట్టాలని కోరారు. మొత్తం ఉత్పత్తిలో సగం వరకు కొనుగోలు చేయడం ద్వారా రైతులకు మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!