
క్రీడలు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా నియమితులు కానున్నారు. ఈ నియామకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే గవర్నర్ ఆమోదంతో ఈ ప్రక్రియ పూర్తికానుంది. పునేఠా 2019లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఎన్నికల సమయంలో వైసీపీ చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయనను ఆ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే.
ఇక పునేఠా స్థానంలో విజిలెన్స్ కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ సీఎస్ నీరభ్ కుమార్ను నియమించనున్నట్లు సమాచారం. ఈ మార్పులతో రాష్ట్ర పరిపాలనలో కీలక నియామకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వర్గాల్లో ఈ నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.









.jpg&w=3840&q=75)










.png&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!