
క్రీడలు
.png&w=3840&q=75)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిలకలడోన సమీపంలో బొలెరో వాహనం లారీని ఢీకొనడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేస్తూ అధికారులతో పరిస్థితిని తెలుసుకున్నారు.
కర్ణాటకకు చెందిన భక్తులు మంత్రాలయం దర్శనానికి వెళ్తుండగా తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలంలోనే ఎనిమిది మంది మృతి చెందగా, మరో పది మంది గాయపడ్డారు. గాయపడిన వారికి సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
తీవ్ర గాయాలున్న వారిని కర్నూలు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.





.webp&w=3840&q=75)














.png&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!