
టెక్ మహీంద్రా సంస్థలో 30 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ సంస్థ స్పందించింది. ఈ వార్తలు పూర్తిగా అసత్యమని సంస్థ స్పష్టం చేసింది. ఈ ప్రచారం ఉద్యోగుల్లో మరియు పరిశ్రమ వర్గాల్లో ఆందోళనకు కారణమైంది.
స్టాక్ ఎక్స్ఛేంజ్కు సమర్పించిన అధికారిక ప్రకటనలో అలాంటి ఉద్యోగాల కోతల ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని టెక్ మహీంద్రా వెల్లడించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సంస్థ కోరింది. ఉద్యోగులు మరియు పెట్టుబడిదారుల్లో నమ్మకం కల్పించేందుకే ఈ స్పష్టత ఇచ్చినట్లు తెలిపింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!