

జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జీవన్రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తూ మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో రైతులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. కాంగ్రెస్ పాలనలో సంక్షేమ పథకాలు సరిగా అమలు కావడం లేదని, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. గతంలో హెచ్చరించినట్లుగానే రైతుబంధు, దళితబంధు పథకాలు బలహీనపడ్డాయని అన్నారు.
హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేస్తూ, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే దానిని రద్దు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. పేదల ఇళ్లను కూల్చడానికే ఈ వ్యవస్థను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. మూసీ నది అభివృద్ధి పేరుతో ఇళ్ల కూల్చివేతలు సరైనవి కావని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రా రద్దుపై తొలి సంతకం చేస్తానని స్పష్టం చేశారు.
ఇక జీవన్రెడ్డిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించిన కేసీఆర్, ఆయనకు భవిష్యత్తులో కీలక బాధ్యతలు ఇస్తామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!