

క్రికెట్ అభిమానులకు వేసవి వినోదాన్ని అందించేందుకు ఐపీఎల్ సిద్ధమవుతోంది. 19వ సీజన్ ప్రారంభానికి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉన్నాయి. టోర్నీ సమీపిస్తున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పది జట్ల కెప్టెన్లతో సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 25 (బుధవారం) సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో బీసీసీఐ మరియు పది జట్ల సారథుల మధ్య పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ఐపీఎల్ 19వ సీజన్ తొలి దశ మ్యాచ్లు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జట్ల ఆటగాళ్లు ప్రస్తుతం నెట్స్ ప్రాక్టీస్తో పాటు సన్నాహక మ్యాచ్లలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. మెగా టోర్నీ ప్రారంభానికి తక్కువ సమయం ఉండటంతో అన్ని జట్ల కెప్టెన్లతో బీసీసీఐ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనుంది.
క్రిక్బజ్ నివేదిక ప్రకారం, ఈ నెల 25 బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ సమావేశం జరగనుందని ఫ్రాంచైజీలకు ఇప్పటికే సమాచారం అందింది. ఈ సమావేశంలో టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించిన పలు ముఖ్య అంశాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

.webp&w=3840&q=75)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!