

అమెరికా రాజధానిలోని వైట్హౌస్లో కాల్పుల కలకలం రేగింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన జర్నలిస్టుల విందు సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్యక్రమంలో పాల్గొన్న వందలాది అతిథులు భయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు.
ఈ ఘటనపై అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే చర్యలు తీసుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరియు ఇతర ప్రముఖులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సంఘటన చోటుచేసుకున్న ప్రదేశాన్ని భద్రతా దళాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టాయి.
అధికారుల సమాచారం ప్రకారం ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని వెల్లడించారు. అయితే ఈ ఘటనతో భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాల్పులు జరిపిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!