
న్యూస్

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచే హక్కు ఉందని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే వ్యాఖ్యానించారు. అయితే ఆ అభిప్రాయాలను వ్యక్తం చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావడం సహజమని ఆయన పేర్కొన్నారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకత్వ వైఫల్యమని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ సరైన మార్గంలో కొనసాగి ఉంటే నేతలు పార్టీని వీడే పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.
రాఘవ్ చడ్ఢా సహా కొంతమంది ఎంపీలు బీజేపీలో చేరడంపై స్పందించిన ఆయన, ప్రతి వ్యక్తి ఎక్కడ ఉండాలి, ఎక్కడి నుంచి బయటకు రావాలి అనే విషయంలో తనదైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పార్టీని వీడటానికి ఏదో ఒక కారణం తప్పకుండా ఉండి ఉంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!