
సినిమాలు

మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ సమీపంలో హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారిపై స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. ముందున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టడంతో ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు.
నారాయణపేట జిల్లా మరికల్కు చెందిన ప్రైవేటు స్కూల్కు సంబంధించిన ఈ బస్సు శంషాబాద్ నుంచి హైదరాబాద్ జలవిహార్కు విద్యార్థులను తీసుకువెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలు కాగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించగా, పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!