.png&w=3840&q=75)

ప్రపంచవ్యాప్తంగా దేశాలు రక్షణ వ్యయం, ఆయుధ కొనుగోళ్లను పెంచుతున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థలపై రుణభారం పెరిగి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు దెబ్బతింటాయని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ జోమో క్వామే సుందరం హెచ్చరించారు. పన్నుల రూపంలో ప్రజల నుంచి వచ్చే డబ్బును సంక్షేమం కోసం కాకుండా ఆయుధాల కొనుగోలుకు వినియోగించడం ప్రపంచానికి ప్రమాదకర సంకేతమని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలను ఉదాహరణగా చూపుతూ, దౌత్య మార్గాల కంటే యుద్ధ మార్గాలే ప్రాధాన్యం పొందుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధాలు చమురు సరఫరా అంతరాయానికి దారితీసి ఇంధన ధరలు పెరగడం, రవాణా వ్యవస్థలపై ఒత్తిడి పెరగడం వంటి పరిణామాలకు కారణమవుతాయని చెప్పారు.
యుద్ధ ప్రభావం కేవలం చమురు మార్కెట్లకే పరిమితం కాకుండా వ్యవసాయం, తయారీ రంగాలు, ఆహార ఎగుమతులపై కూడా పడుతుందని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 2024లో సుమారు 2.7 లక్షల కోట్ల డాలర్లు సైనిక ఖర్చులకు వెచ్చించగా, అందులో 36 శాతం అమెరికా వాటా అని తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగితే హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా అంతరాయం కలిగి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందన్నారు. రక్షణ బడ్జెట్లు పెరుగుతుండగా సంక్షేమ పథకాలు తగ్గిపోతున్నాయని, దీని వల్ల వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించారు. ఆసియా దేశాల నుంచి ఆహార ఎగుమతులు తగ్గే ప్రమాదం కూడా ఉందని పేర్కొన్నారు.
.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!